ఉండవెల్లి, ఏప్రిల్ 27 : రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటూ టీఆర్ఎస్ పార్టీ జెండా ప్రజలందరికీ అండగా నిలిచిందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే అబ్రహం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే రాష్ట్రం అదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎం పీపీ దేవన్న, నాయకులు రమణ, వెంకట్రామయ్యశెట్టి, తేజ, నర్సింహ, అల్లాబకాస్, రాముడు పాల్గొన్నారు.
మానవపాడులో..
మానవపాడు, ఏప్రిల్ 27 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సరిత జెండావిష్కరించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేం ద్రంలోని బస్టాండు ఆవరణలో జెడ్పీ చైర్పర్సన్ సరిత ము ఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
గద్వాలలో..
గద్వాల, ఏప్రిల్ 27 : పేదలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్మన్లు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం పార్టీ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమం లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ బాబర్, జములమ్మ ఆల య కమిటీ చైర్మన్ సతీశ్కుమార్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, శ్రీనివాసులు, మహేశ్, రాజు, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుభాన్, నాయకులు రమేశ్నాయుడు, శ్రీనివాస్రెడ్డి, రాంచంద్రారెడ్డి, నజీర్, యూసూఫ్, సాయిశ్యాంరెడ్డి, ధర్మనాయిడు, నాగులుయాదవ్, తిమ్మన్న, వంశీ, రమేశ్రెడ్డి, చారి పాల్గొన్నారు.
మల్దకల్లో..
మల్దకల్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ రాజారెడ్డి ఆధ్వర్యం లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. అలాగే కుర్తి రావుల చెర్వు గ్రామంలో పార్టీ నా యకుడు పటేల్ జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, వైస్ ఎంపీపీ పెద్దవీరన్న, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సింగిల్విండో ఉపాధ్యక్షుడు విష్ణు, మండల కోఆప్షన్ సభ్యుడు హైదర్, సర్ప ంచులు వీరేశ్నాయక్, అంజి, ఆంజనేయులు, యాకోబు, స ర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ రా జు, నాయకులు అజయ్, వెంకటన్న, నరేందర్, సీతారామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్, నర్సింహులు, పరశురాము డు, గోవింద్, ప్రభాకర్, ఉప సర్పంచ్ మల్దకల్, నారాయణ, మల్దన్న, మహబూబ్అలీ, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.
గట్టులో..
గట్టు, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటేశ్ పేర్కొన్నారు. గట్టులో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మంగళవారం జరిపారు. బస్టాండు ఆవరణలో ఏర్పాటుచేసి న కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా కన్వీన ర్ రామకృష్ణారెడ్డితో కలిసి పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటేశ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యు డు వాహబ్, నాయకులు హన్మంతురెడ్డి, రామునాయుడు, బజారి, రవి, సంతోశ్, వెంకటేశ్, గోవింద్ పాల్గొన్నారు.
ధరూర్ మండలంలో..
ధరూర్, ఏప్రిల్ 27 : మండల కేంద్రంలో వైఎస్సార్ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్రెడ్డి, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి పాల్గొని టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే ర్యాలంపాడులో యువజన నాయకులు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీలు శివలీల, దౌలన్న, మార్కెట్ డైరెక్టర్ నర్సింహులు, నాయకులు శ్రీనివాస్రెడ్డి, జాకీర్, రాజారెడ్డి, వెంకటేశ్నాయుడు, సవారన్న, నర్సింహులు పాల్గొన్నారు.
కేటీదొడ్డి మండలంలో..
కేటీదొడ్డి, ఏప్రిల్ 27 : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో జెడ్పీటీసీ రాజశేఖర్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ జెండాను అవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, నాయకులు చక్రధర్రావు, ఉరుకుందు, యుగేంధర్, రాజేశ్, శేఖర్, వీరేశ పాల్గొన్నారు.
అలంపూర్లో..
అలంపూర్, ఏప్రిల్ 27 : బడుగు బలహీల వర్గాల వారికి అండగా నిలిచిన టీఆర్ఎస్ పార్టీ పేదల గుండె నిండా ఉందని అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ అన్నారు. మంగళవారం అలంపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రామయ్యశెట్టి, షేక్ హుస్సేన్ వలీ, దేవరాజు, మద్దిలేటి పాల్గొన్నారు.
అయిజలో..
అయిజ, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం మున్సిపాలిటీలోని సింగిల్ విండో కార్యాలయం సమీపంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఉప్పల క్యాంపు గ్రామంలో టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, ఇన్చార్జి ఎంపీపీ నాగేశ్వర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.