నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నల్లబెల్లి, ఏప్రిల్ 26: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరంటు ఇస్తూ వారి అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో రూ.1.3కోట్లతో నిర్మించిన 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. సమైక్యపాలనలో ప్రజలు లోవోల్టేజీ సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అప్పులు తెచ్చి పంటలు పండించేందుకు రైతులు పాటుపడినా అరకొర విద్యుత్ సరఫరాతో దిగుబడి రాకా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే మండల ప్రజలకు ప్రత్యేక నిధులతో విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్ నాగులగాని సలేంద్ర-నాగేశ్వర్రావు, ఎంపీపీ ఊడుగుల సునీత-ప్రవీణ్, విద్యుత్శాఖ ఎస్ఈ వెంకటరమణ, కన్స్ట్రక్షన్ డీఈ సామ్యనాయక్, డీఈ మృంత్యుంజయ్రావు, ఏడీఈలు నర్సింగరావు, చలపర్తిరావు, అమృనాయక్, ఏఈలు విజేందర్, రమేశ్, సంపత్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటర్ ప్రవేశాలకు జ్యోతిబా పూలే సొసైటీ దరఖాస్తుల ఆహ్వానం
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు