ఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజన్ దిగుమతిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి, ఆక్సిజన్ అందుబాటుపై శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలను ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, క్రిటికల్ కేర్ యూనిట్లో రోగులకు ఉపయోగించే పరికరాల దిగుమతిపై సుంకాన్ని ఎత్తేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు.