ఎంజీఎంలో ప్రాణవాయువు ఫుల్
23 కేఎల్ సామర్థ్యంతో ప్లాంట్
కొవిడ్ కారణంగా రెట్టింపైన వాడకం
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 22 : ప్రస్తుత కరోనా గడ్డు కాలంలో రోగులకు ఆక్సిజన్ అవసరం ఎంతగానో ఉన్నది. అలాంటి ప్రాణవాయువును ఎంజీఎం దవాఖానలో అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచేందుకు దవాఖాన యంత్రాం గం నిరంతరం కృషి చేస్తున్నది. ఇందుకు ప్రత్యేకం గా ప్లాంటు ఏర్పాటు చేసి అత్యవసర విభాగాలతో పాటు ప్రతి విభాగానికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. 1100 పడకలకు ప్రాణవాయువును అందుబాటులో ఉంచుతున్నారు. 23కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంటు ద్వారా ఆయా విభాగాలకు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నా రు. ప్లాంట్లకు తోడు 200 ఆక్సిజన్ సిలిండర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
రెట్టింపైన వాడకం..
కొవిడ్ కారణంగా ఆక్సిజన్ వాడకం గణనీయం గా పెరిగిందని అధికారులు తెలిపారు. గతంలో ప్రమాదాల బారిన పడిన వారికి, శస్త్రచికిత్స నిర్వహణకు, పరిస్థితి విషమంగా ఉన్నవారికి మాత్రమే ఆక్సిజన్ అవసరమయ్యేదని, ఇప్పుడు కరోనా బాధితులకు ఎక్కువ అవసరం పడుతుండడంతో వినియోగం రెట్టింపైందని చెబుతున్నారు. పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్లాంట్తో పాటు సిలిండర్లను ఫిల్ చేసి ఉంచుతున్నట్లు తెలిపారు.
నిరంతరం పర్యవేక్షణ
సుమారు 1300కు పైగా పడకల సామర్థ్యం కలిగిన దవాఖానలో సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించడం కష్టతరం కావడంతో ప్లాంట్ ద్వారా అన్ని విభాగాలకు పైప్లైన్లతో సరఫరా చేస్తున్నారు. ట్యాం కర్లలో తీసుకొచ్చిన ఆక్సిజన్ను ప్లాంట్లో నింపి సరఫరా చేస్తున్నారు. ఈ విధానంతో ఒకే చోట నుం చి పర్యవేక్షణకు వెసులుబాటు కలిగింది. ఇద్దరు సిబ్బంది ఈ విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నా రు. రోగులను పరీక్షలకు తీసుకెళ్లే సమయంలో సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
ఇవి కూడా చదవండి
సెల్ఫ్ ఐసోలేషన్లో సూపర్స్టార్ మహేశ్ బాబు
మోదీకి చిరంజీవి చురకలు.. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా