అందిన సాయం..టీచర్ల ఆనందం
ఆపత్కాల ఆసరాతో గురువులకు భరోసా..
ఖాతాల్లో రూ.2వేల చొప్పున నగదు జమ, 25కిలోల చొప్పున బియ్యం అందజేత
ముఖ్యమంత్రి కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల కృతజ్ఞతలు
ములుగు టౌన్, ఏప్రిల్ 21 : కరోనాతో విద్యాసంస్థలు మూతపడి, వేతనాలు లేక ప్రైవేట్ టీచర్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కుటుంబ పోషణ భారమై నానా అవస్థలు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆప త్కాలపు ఆసరా ఇచ్చి అండగా నిలిచింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో టీచర్కు నెలకు రూ.2వేలు, 25 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించగా బుధ వారం నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తు న్నారు. ములుగు జిల్లావ్యాప్తంగా 785మంది టీచర్లు, సిబ్బంది దరఖాస్తు చేసుకోగా జిల్లా విద్యాశాఖ సమ ర్పించిన నివేదికల ప్రకారం మొదటి విడుత 431మందికి వారి ఖాతాల్లో నగదు జమచేశారు. మలి విడుతలో మిగతా వారికి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డు సాయంతో సమీపంలోని రేషన్ షాపులో బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించడంతో వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.