ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
కేఆర్కే కాలనీలో రూ.2.50కోట్లతో భగీరథ పనులు ప్రారంభం
టీఆర్ఎస్లో పలువురు చేరిక
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 19: ఇంటింటికీ సురక్షితమైన తాగు నీరందించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్భగీరథ పనులు చేపట్టారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఫిల్టర్బెడ్ నుంచి కేఆర్కే కాలనీ వరకు నిర్మించనున్న పైప్లైన్ పనులకు సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేఆర్కే కాలనీలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిసమస్యలను తీర్చామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజానీ, ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ అంజూ, నాయకులు ఆనంద్, నర్సింగ్, లక్ష్మణ్, కొండ గణేశ్,నారాయణ పాల్గొన్నారు.
డ్వాక్రాభవనం ప్రారంభం..
మావల మండల కేంద్రంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.5లక్షలతో నిర్మించిన డ్వాక్రా భవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, ఏపీడీ రవీందర్ రాథోడ్, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ దొగ్గలి ప్రమీల, ఉపసర్పంచ్ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంజాన్ సందర్భంగా పేదలకు సరుకులు పంపిణీ చేశారు. రూరల్ మండలంలోని తంతోలిలో అంగన్వా డీ భవనం, డ్రెన్స్, కచ్గట్ నిర్మాణం, మత్తడిగూడలో అంగన్వాడీ భవన నిర్మాణం, య శ్వంత్గూడలో ఎస్టీ క మ్యూనిటీ హాల్, యాపల్గూడలో అంగన్వాడీ భవనం, శబరిమాత ఆశ్ర మం నిర్మాణాలకు భూ మిపూజ చేసి పనులు ప్రారంభించారు.