ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు నియంత్రణలతో ముందుకొచ్చిన క్రమంలో తాజాగా ముంబైలో అన్ని బీచ్లు, గార్డెన్లు, బహిరంగ మైదానాలను ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక వారాంతాల్లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల వరకూ మూసివేయనున్నుట్టు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ముంబైలో కరోనా కేసుల పెరుగుదల, కఠిన నియంత్రణల అమలుతో వలస కూలీలు పనులు లేక స్వస్ధలాల బాటపడుతుండటం గత ఏడాది పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి గత ఏడాది మార్చిలో కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో రవాణా సదుపాయలు లేక వలస కూలీలు కాలినడకనే స్వస్థలాలకు చేరుకున్నారు.