అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320 కేసులు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిపోతున్నది. శనివారం 62,973 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,321 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 144, రంగారెడ్డిలో 121, నిజామాబాద్లో 96, నిర్మల్లో 64, జగిత్యాలలో 46, కరీంనగర్లో 41, వరంగల్ అర్బన్లో 43 కేసులు రికార్డయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతి చెందగా, దీంతో మృతుల సంఖ్య 1,717కు చేరుకున్నది.
ఒకే ఇంట్లో ఆరుగురికి..
కోహీర్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పర్సపల్లిలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారి సంబంధీకుల వివరాలను తెలుసుకునేందుకు ఆదివారం ఇంటింటా సర్వే నిర్వహించినట్టు ఎంపీహెచ్ఎస్ అశోక్కుమార్ తెలిపారు. వైరస్ వ్యాప్తి నివారణకు గ్రామంలోని ప్రధాన వీధుల్లో సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
ఏపీలో కొత్త కేసులు 1,730
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తున్నది. శనివారం 31,072 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 1,730 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 కేసులు వెలుగుచూశాయి.
జగిత్యాల జిల్లా సిరిపూర్లో స్వచ్ఛంద లాక్డౌన్
మల్లాపూర్, ఏప్రిల్ 4 : కరోనాను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్లో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. ఆదివారం సర్పంచ్ భూక్యా గోవింద్నాయక్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమై.. గ్రామంలో లాక్డౌన్ అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. గ్రామంలో హెయిర్ కటింగ్షాపులు, హోటళ్లు ఈనెల 15 వరకు మూసివేయాలని సర్పంచ్ సూచించారు. కిరాణ, ఇతర దుకాణాలు ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ నిర్ణీత దూరం పాటిస్తూ విధిగా మాస్క్ ధరించాలని, లేనిపక్షంలో రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇవీ కూడా చదవండి…
కరోనా కట్టడి.. పంచ సూత్రాలతోనే సాధ్యం: మోదీ
41 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇంటర్ వార్షిక పరీక్షలకు 10 కేంద్రాలు
తేయాకు తోటలో 20 కిలోల కాలనాగు కలకలం..!