విద్యాశాఖ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 1,174 ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఇటీవల ఓ సర్వే నిర్వహించి ఇంటర్నెట్, కంప్యూటర్లు ఉన్న స్కూళ్ల వివరాలు సేకరించారు. ఇంటర్నెట్ ఉన్న 1,174 స్కూళ్లలో కొన్నింటికి దాతల, మరికొన్నింటిలో స్థానికంగా అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ సౌజన్యంతో నడుస్తున్న ఫైబర్ టూ ది హోమ్ కార్యక్రమంలో 286 స్కూళ్లకు ఇంటర్నెట్ వసతిని కల్పించారు.