టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న తాజా చిత్రం టక్ జగదీష్. శివనిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఏప్రిల్ 13న ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నాని టీం ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించింది. వైజాగ్ లో ఏర్పాటు చేయనున్న ఈవెంట్లో గ్రాండ్గా ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు.
టక్ జగదీష్ చాలా అరుదైన చిత్రమని అన్నాడు నాని. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం జరుగని పని అని, అందుకే టక్ జగదీష్ చాలా స్పెషల్ చిత్రమని, ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారని చెప్పాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో జగపతిబాబు కీ రోల్ చేస్తున్నాడు.ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్, టీజర్కు మంచి స్పందన వస్తునప్న సంగతి తెలిసిందే.