నైరోబీ, మార్చి 30: టాంజానియా అధ్యక్షుడు జాన్ మగూఫులీ పార్థివదేహాన్ని గత వారం ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించారని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తిని సీరియస్గా తీసుకోనందుకు, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసినందుకు మగూఫులీని ప్రతిపక్షాలు తూర్పారబట్టినా… అవినీతి నిర్మూలనకు జరిపిన కృషితో ప్రజలకు ఆయన అభిమాన నాయకుడయ్యారు. మగూఫులీ గుండెపోటుతో మరణించినట్లు ఈ నెల 17న ప్రభుత్వం ప్రకటించింది. ఆయన కరోనాతో మరణించారన్న కథనాలు వినిపించాయి.
ఇవి కూడా చదవండి:
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై
హాంకాంగ్పై చైనా మళ్లీ కన్నెర్ర..
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం