కోల్కతా, మార్చి 25: ఓట్ల కోసం బీజేపీ పశ్చిమబెంగాల్లో డబ్బు పంచుతున్నదని, ఈ విధంగా డబ్బులిచ్చేవారిని పట్టిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం కల్పిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మోదీ లాంటి అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను ఇంతకుముందెన్నడూ చూడలేదన్నారు. మైనార్టీల ఓట్లను లాక్కునేందుకు బీజేపీ వెనుక ఉండి మద్దతిస్తూ మరో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిందని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీని ఉద్దేశించి మమత ఆరోపించారు.