హైదరాబాద్ : హైదరాబాద్ –రంగారెడ్డి -మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి గెలుపునకు కృషిచేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వాణీదేవిని కేసీఆర్ అభినందించి శాలువాతో సత్కరించారు. వాణీదేవికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అభినందించారు.
రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జోగినపల్లి సంతోశ్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్ రెడ్డి, శంభీపూర్ రాజు, నవీన్ రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, కేపీ వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, మెతుకు ఆనంద్, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఉన్నారు.