చెన్నై : గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి 9, 10, 11వ తరగతులను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ విధానంలో విద్యాభ్యాసం కొనసాగనున్నట్లు పేర్కొంది. మరోవైపు బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని 12వ తరగతి విద్యార్థులకు మాత్రం బోధన కొనసాగనున్నట్లు తెలిపింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్-19 భారిన పడుతున్న పరిస్థితుల్లో వైద్యారోగ్యశాఖ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.