మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా.. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే మీ డ్రైవింగ్ లైసెన్స్ను స్పాట్లోనే సస్పెండ్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా కార్యచరణను రూపొం దించారు. దీని కోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్పై మరింత కఠినంగా ఉండేందుకు ఈ రెండు శాఖల అధికారులు సమయాత్తమవుతున్నారు. దీని కోసం వాహనదారుల డాటా బేస్ పోలీసు ట్యాబ్లకు అనుసంధానం చేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడితే అతడి వివరాలు పోలీసు ట్యాబ్లో ఎంట్రీ చేయగానే.. ఆ సమాచారం ఆర్టీఓ డాటాలోకి చేరి.. వెంటనే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో మద్యం సేవించి వాహనాలను నడిపేవారి లైసెన్స్ సస్పెండ్ ఇక వెంటనే జరిగిపోను న్నది. ఈ సమాచారం పోలీసు, ఆర్టీఓ అధికారుల డాటాలో ఉండిపోతుంది. సస్పెండైన తర్వాత కూడా వాహనదారుడు మద్యం తాగి వాహనం నడిపి పోలీసుల తనిఖీలో పట్టుబడితే.. పోలీస్ ట్యాబ్లో లైసెన్స్ నంబరు లేదా వాహనం నంబర్ ఎంట్రీ చేసిన వెంటనే సస్పెండైన లైసెన్స్ సమాచారం తెలిసిపోతుంది. దీంతో తదుపరి చర్య లు తీసుకునేందుకు చాలా సులభంగా ఉంటుందని పోలీసులు, ఆర్టీఓ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 2020 ఏడాదిలో మద్యం సేవించి వాహనాలను నడిపిన 2,402 వాహనదారుల లైసెన్స్ను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు ఆర్టీఓ అధికారులకు పంపారు. 2021లో 2034 వాహనదారుల లైసెన్స్లను సస్పెండ్ చేయాలని ఆర్టీఓ అధికారులకు పంపారు. వీటిని పరిశీలించిన ఆర్టీఓ అధికారులు పోలీసు సిఫార్సు చేసిన లైసెన్స్లను సస్పెండ్ చేశారు.