మహబూబాబాద్ : జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో అన్నావదినలు ఒకేరోజు మృతి చెందడంతో కలత చెందిన తమ్ముడు గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అలువాల రామయ్య, అతని భార్య చెన్నమ్మ మంగళవారం మృతి చెందగా, బుధవారం వారికి దహనసంస్కారాలు నిర్వహించారు. వీరికి సంతానం లేకపోవడంతో రామయ్య తమ్ముడు అలువాల వీరస్వామి పాల్వంచ పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ అన్నావదినలను చూసుకునేవారు. కాగా, అన్నావదినలు ఒకేరోజు మృతి చెందడంతో కలత చెందిన అలువాల వీరస్వామి(70) గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.