హైదరాబాద్ : ఐటీఐఆర్ పాలసీని నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించింది. పారిశ్రామికాభివృద్ధికి అమలవుతున్న ఇతర పథకాలు, పాలసీలను దృష్టిలో పెట్టుకుని ఐటీఐఆర్ పాలసీని నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఐటీఐఆర్పై టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా దానికంటే మెరుగైన పథకాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రి నుంచి లేఖ వచ్చిందన్నారు. ఈ అంశం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లష్టర్ స్కీమ్, వాణిజ్య ప్రోత్సాహక కార్యక్రమాల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు.