సిద్దిపేట అర్బన్, మార్చి 12: సిద్దిపేట పట్టణానికి ఉత్తర భాగాన మా మిండ్ల బాయి దగ్గర గల పాటిగడ్డ మీద చారిత్రక ఆధారాలు లభించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, మామిండ్లబాయి లక్ష్మారెడ్డి, చంటి శుక్రవారం వెల్లడించారు. శాతవాహనుల కాలం నాటి కుండపెంకులు, మట్టిపూసలు, పాలరాయిగోళి, ఇటుకలు, మధ్య రాతియుగం నాటి రాతి పరికరాల అవశేషాలు దొరికాయన్నారు. ఇవి వెయ్యేండ్ల క్రితం మాతంగి వాగు ఒడ్డున మానవ ఆవాసాలు ఉన్నాయని తెలిపే చారిత్రక ఆధారాలని వారు పేర్కొన్నారు.