సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్కు హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో అవమానం జరిగినట్టు ఓ వార్త ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఓ ప్రైవేట్ పబ్ నిర్వాహకులు సిద్ శ్రీరామ్ తో ఈవెంట్ను ఏర్పాటు చేశారు. షో నిర్వహిస్తున్న పబ్ లో 500 సీట్ల సామర్థ్యం ఉంది. ఎంట్రీ ఫీజును రూ.1500గా నిర్ణయించారు. అయితే పరిమితికి మించి ఆడియెన్స్ ఈ ప్రోగ్రాంకు వచ్చారు. సిద్ శ్రీ రామ్ స్టేజ్పై పాడుతుంటే కొందరు వ్యక్తులు పోడియం వైపు వాటర్, ఆల్కాహాల్ ను విసిరారట.
ఆకతాయిల ఓవరాక్షన్తో నిరుత్సాహానికి లోనైన సిద్ శ్రీరామ్ అర్థాంతరంగా షోను నిలిపేశాడు. ఓ ప్రముఖ గాయకుడిని గౌరవించడం ఇలాగేనా…? అంటూ స్టేజ్పై నుంచి దిగి వెళ్లిపోయాడని టాక్. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సిద్ శ్రీరామ్ ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. ప్రస్తుతం ఈ సమస్యను సెటిల్ చేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ లేకుండా ఎప్పుడూ ఉండకుండా మనస్సును క్రమశిక్షణలో పెట్టండి అంటూ ఆ తర్వాత ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టాడు సిద్ శ్రీరామ్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.