లక్నో: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. వన్డే సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో తేలిపోయింది. ఆల్రౌండ్షోతో అదరగొట్టిన సఫారీలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియ విమెన్స్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్(50) అర్ధశతకంతో రాణించగా హర్మన్ప్రీత్ కౌర్(40) ఫర్వాలేదనిపించింది. ప్రత్యర్థి బౌలర్లలో ఎస్ ఇస్మాయిల్(3/28), ఎన్ లాబా(2/41) టీమిండియాను ఇబ్బందిపెట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓపెనర్లు భారత బౌలర్లను ఆటాడుకున్నారు. ఓపెనర్లు లిజెల్లీ లీ(83 నాటౌట్), లారా వోల్వార్డ్ట్(80) తొలి వికెట్కు 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. జులన్ గోస్వామీ రెండు వికెట్లు పడగొట్టింది.