టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం
జీడబ్ల్యూఎంసీ చరిత్రలో రెండోసారి
ఎజెండాలోని 8 అంశాలపై చర్చ
వరంగల్, జనవరి 19 : మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వ హించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు కార్యదర్శి విజయల క్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కరోనా నిబంధనలకు అనుగుణంగా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులందరూ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సర్వ సభ్య సమావేశంలో పాల్గొనాలని కోరారు.
ఇది రెండోసారి
కార్పొరేషన్ చరిత్రలో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం ఇది రెండోసారిగా చెబుతున్నారు. కరోనా ప్రారంభంలో 2020-21 బల్దియా బడ్జెట్ సమావేశాన్ని అప్పటి మేయర్ గుండా ప్రకాశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి బడ్జెట్ను ఆమోదించారు. కరోనా మూడో వేవ్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో గురువారం నిర్వహి స్తున్న బల్దియా సర్వసభ్య సమావేశాన్ని మరోసారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేయర్ గుండు సుధారాణి కరోనా బారిన పడి హోం ఐసొలేషన్లో ఉంటున్న విషయం తెలిసిందే.
ఎనిమిది ఎజెండా అంశాలు
బల్దియా సర్వసభ్య సమావేశం ముందుకు ఎని మిది ఎజెండా అంశాలు రానున్నాయి. టెలీ కాన్ఫ రెన్స్ ద్వారా జరిగే సమావేశంలో ఎజెండా అంశా లపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. బల్ది యాలో వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల వేతనం ప్ర భుత్వ ఉత్తర్వుల మేరకు 30 శాతం పెంచే అంశం కౌన్సిల్లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. కొత్తపేట నుంచి ఆరెపల్లి ఓఆర్ఆర్ వరకు రూ.1. 45 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా పేదలు ఐదు రూపాయల భోజనం, వరద బాధితుల పునరావాస కేంద్రాలకు భోజనం సరఫ రా చేసినందుకు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్కు రూ. కోటి 78 లక్షలు చెల్లించే అంశానికి ఆమోద ముద్ర వేయనున్నారు. అర్బన్ మలేరియాలో దిన సరి కూలీలుగా పనిచేస్తున్న 90 మంది కార్మి కులకు రోజుకు రూ. 427 చొప్పున ఏడాదికి రూ. కోటీ 39 లక్షలు చెల్లింపునకు పరిపాలనా అనుమ తులు మంజూరు చేయనున్నారు. గ్రేటర్ కార్పొరే షన్ పరిధిలో హోం కంపోస్టింగ్ సెల్ ఏర్పాటు చేసే అంశానికి ఆమోదం తెలుపనున్నారు. 44వ డివిజన్ అమ్మవారిపేట గట్టమ్మ నుంచి జక్కులొద్ది వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 1.99 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నా రు. అమృత్ 2000 కేఎల్-ఈఎల్ఎస్ఆర్ నిర్మా ణానికి భూమిని స్వాధీనం చేసుకునేందుకు సర్వే నంబర్ 32 యాదవనగర్లో రూ.77 లక్షల 66 వేలు చెల్లించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. 42వ డివిజన్లో రూ. 44 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు.