నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేట, జనవరి19: రాజకీయాలకు అతీ తంగా రైతులు పంటల సమగ్ర సర్వేకు సహకరిం చాలని నర్సంపేట ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్రెడ్డి కో రారు. బుధవారం నర్సంపేటలో ఆయన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. వడగండ్లు పడి నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ మూడు రోజుల క్రితం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వినతిపత్రాన్ని సమర్పించామని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని స్వయంగా వచ్చి పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరామని అన్నారు. ఫలితంగా కేసీఆర్ సూచన మేరకు మంత్రులు, అధికారుల బృందం వచ్చి దెబ్బతిన్న పంటలను పరిశీలించారని అన్నారు. బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చారని పేర్కొన్నారు. జరిగిన పంటనష్టాన్ని అంచనావేసి ప్రాథమిక రిపో ర్టును ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు అందించారని తెలిపారు. నేటి నుంచి రైతుల వారీగా తుది సర్వేను నిర్వహించాలని మంత్రులు అధికారులను ఆదేశించారని అన్నారు. సర్వే చేసిన తర్వాత పూర్తి వివరాలను ఆయా గ్రామాల గ్రామ పంచాయతీల నోటీసు బోర్డుపై పెట్టాలని ఆయన కోరారు. అదేవిధంగా రైతుల నుంచి వచ్చే అభ్యర్థ నలను స్వీకరించాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే లా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.