రాయపర్తి, జనవరి 19: రాష్ట్ర పంచాయతీరా జ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావును బుధవారం మండలంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి, పెం డింగ్ పనులు, బిల్లుల చెల్లింపులపై మంత్రికి వా రు నివేదించారు. స్పందించిన ఎర్రబెల్లి దయాక ర్రావు పనుల నిర్వహణకు ప్రణాళికలు తయా రు చేయిస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మునావత్ నర్సిం హానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు గారె న ర్సయ్య, కోదాటి దయాకర్రావు, రెంటాల గోవర్ధ న్రెడ్డి, అయిత రాంచందర్, నలమాస సారయ్య, పూస మధు, భూక్యా దీప్లానాయక్, బిల్ల సుభాష్ రెడ్డి, భూక్యా భద్రూనాయక్, కర్ర సరిత, రవీంద ర్రెడ్డి, కుంచారపు హరినాథ్, కుక్కల భాస్కర్, కందికట్ల స్వామి, బానోతు నర్సింహ, చెడుపాక కుమారస్వామి, చిన్నాల రాజబాబు, గూడెల్లి శ్రీని వాస్, అండ్రెడ్డి యాకూబ్రెడ్డి, గజవెల్లి ప్రసా ద్, మాలోతు వసుందర్నాయక్ పాల్గొన్నారు.
డైరీని ఆవిష్కరించిన మంత్రి
పర్వతగిరి: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు గున్న రాజేందర్రెడ్డి, కార్యదర్శి యానాల ప్రభాక ర్రెడ్డి ప్రచురించిన 2022 డైరీ, క్యాలెండర్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంపటి శ్రావణి, పురో హిత రత్న డాక్టర్ పోలోజు భాస్కరాచార్యులు, సో మేశ్వర్రావు, సుస్మిత పాల్గొన్నారు