నేరాల నియంత్రణలో దేశంలోనే ప్రత్యేకం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మామునూరు క్యాంపులో స్పోర్ట్స్ డే
మంత్రితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అరూరి,
కరీమాబాద్, జూలై 18: నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రముఖంగా నిలుస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ గంగారం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ దేహ దారుఢ్యానికి క్రీడలు దోహదపడుతాయ ని అన్నారు. ఆటలతో ఏకాగ్రత పెరుగడంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులకు అన్ని వసతులు కల్పించారని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలన్నారు. క్రీడల్లో విజేతలుగా నిలిచిన పోలీసుల కు బహుమతులు అందజేశారు. అనంతరం మామునూరు క్యాంపులో మొక్కలను నాటి నీరు పోశారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రట రీ ఇనుగాల జోగిరెడ్డి, జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఖాజా, రిటైర్డ్ డీఎస్పీ అంబా ల ఉదయ్కిరణ్, గంగవరపు మధుసూదన్, ఎండీ సర్వర్ మంత్రి ఎర్రబెల్లిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ ఈదురు అరుణ, అడిషనల్ ఎస్పీ రాగ్యనాయక్, డీఎస్పీలు శ్రీనివాస్, సుధీర్, భోజరాజు, అడిషనల్ కమాండెంట్లు భాస్కర్రావు, పాండునాయక్ తదితరులు పాల్గొన్నారు.