రైతు సంక్షేమ ప్రభుత్వం మాది
బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి విపత్తు నిధి నుంచి పంట నష్టపరిహారం ఇప్పించాలి
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, జనవరి 18: అకాల వర్షాలతో రైతు లు నష్టపోతే విపక్షాలు నీచ రాజకీయాలకు పాల్ప డుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శిం చారు. పరకాల పట్టణంలోని రైతు వేదిక భవ నం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. వడగండ్ల వర్షంతో డివిజన్లోని పరకాల, నడి కూడ, ఆత్మకూరు, దామెర మండలాల్లో 3500 ఎకరాల్లో మక్కజొన్న, సుమారు 6 వేల ఎకరాల్లో మిర్చి, వందల ఎకరాల్లో కూరగాయలు, గీసు కొండ, సంగెం మండలాల్లో సుమారు 4వేల ఎక రాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ విషయా న్ని మంత్రి దయాకర్రావు సహాయంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన మంత్రులు, అధికారుల బృందాన్ని పంపించి క్షేత్ర స్థాయిలో పంట నష్టం వివరాలు తెలుసుకోవాల ని ఆదేశించారన్నారు. బీజేపీ నాయకులు ఫేక్ న్యూస్ యూనివర్సిటీ నడుపుతున్నారని, త్వరలో నే దాన్ని మూసుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్ర కృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే రైతాంగాన్ని కేంద్రమే ఆదుకోవాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. స్థానిక, రాష్ట్ర బీజేపీ నాయ కులకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే కేంద్రాన్ని ఒప్పించి విపత్తు నిధి నించి రైతులకు సాయమందించి అండగా నిలువాలని డిమాండ్ చేశారు. పంట నష్టంపై స్పందించిన సీఎం కేసీఆర్, పరిశీలించిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి ద యాకర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అని త, ఆగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు, పరకాల, నడికూడ, సంగెం, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధు లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.