జిల్లాలో మండలాల వారీగా దరఖాస్తుల పరిశీలన పూర్తి
26 నుంచి పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం
జారీ కానున్న 3296 కొత్త రేషన్ కార్డులు
ఆగస్టు నుంచి లబ్ధిదారులకు అందనున్న బియ్యం
జయశంకర్ భూపాలపల్లి, జూలై 16 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకా రం చుట్టింది. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3,296 మందినిపౌరసరఫరాల శాఖ అధికారులు అర్హులుగా నిర్ధారించారు. త్వరలోనే వారికి కార్డులు అందజేసేం దుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
జిల్లాలో 3,296 కొత్త రేషన్ కార్డులు
జిల్లాలో 3,296 కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. గతంలో లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్త కార్డుల్లో అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 712, పలిమెల మండలంలో అత్యల్పంగా 57 కార్డులు అందనున్నా యి.
26 నుంచి జారీకి సన్నాహాలు
కొత్త రేషన్ కార్డులను ఈ నెల 26 నుంచి అర్హులకు అందించి, ఆగస్టు నుంచి సివిల్ సప్లయ్ శాఖ నుంచి బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. .
ఆదేశాలు రాగానే పంపిణీ
కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సివిల్ సప్లయ్ కార్యాలయ కమిషనర్ నుంచి ఇప్పటి వరకు ఎలాం టి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే పరిశీలించిన దరఖాస్తులను అప్రూవల్ చేసి జారీ చేస్తాం.