ప్రమాదరహిత ఏరియాగా పేరు తీసుకురావాలి
డీఎంఎస్ (మైనింగ్) శ్యామ్మిశ్రా
భూపాలపల్లి, జూలై 16: ప్రతి సింగరేణి ఉద్యోగి రక్షణ నిబంధనలు పాటించి, నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీఎంఎస్)శ్యామ్మిశ్రా అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్ల్లెందు అతిథి గృహంలో సింగరేణి ఏరియా 16వ త్రైపాక్షిక సమావేశం నిర్వహించారు. డీఎంఎస్(ఎలక్ట్రికల్)ఎస్ పుట్టరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంఎస్(మైనింగ్) శ్యామ్మిశ్రా మాట్లాడుతూ ప్రమాదరహిత ఏరియాగా భూపాలపల్లికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలుత ఆయన గనుల్లోని సమస్యలను సంబంధిత అధికారులు, యూనియన్ల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సహజ మరణాల సంఖ్యను తగ్గించడానికి 2డీ ఈకో, టీఎంటీ పరీక్షలు చేసేలా సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను సింగరేణి యాజమాన్యం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్మైన్స్ సేఫ్టీ (డీడీఎంఎస్)లు బాలసుబ్రహ్మణ్యం(మైనింగ్), మెరుగు రఘు, గైరవ్ లడ్డా, భద్రేశ్కుమార్దివ్య (ఎలక్ట్రికల్) ఎల్వీ సూర్యనారాయణ (జీఎం సేఫ్టీ, రామగుండం రీజియన్), భూపాలపల్లి ఏరియా జీఎం టీ శ్రీనివాస్, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, నాయకులు బడితల సమ్మయ్య, తుమ్మెటి రఘోత్తంరెడ్డి, మెత్కుపల్లి సమ్మిరెడ్డి, ఏరియా ప్రాతినిధ్య సంఘం నుంచి కొరిమి రాజ్కుమార్, మోటపల్కుల రమేశ్, ఎస్వోటూ జీఎం విజయ్ప్రసాద్, ఏజీఎం(ఈఅండ్ఎం) రామలింగం, రమేశ్బాబు(డీజీఎం ఏడబ్ల్యూఎస్), ఏరియా అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, సేఫ్టీ ఆఫీసర్ బీ రవీందర్, సర్వే ఆఫీసర్ రాజగోపాల్, కేటీకే ఓసీపీ-2 పీవో జాన్ఆనంద్, గనుల మేనేజర్లు వెంకటేశ్వరరావు, భిక్షపతి, జాకీర్ హుస్సేన్, రాంభరోస్మహ్తో, చిర్ర శ్రీనివాస్, రక్షణ అధికారులు, ఇంజినీర్లు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.