కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి, మాజీ ఎంపీ సీతారాంనాయక్
మడికొండ, ఏప్రిల్ 14 : కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. 53వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాజీపేట దర్గా సొసైటీ డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్, 53వ డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుక్కల శ్రీకాంత్, కాంగ్రెస్ యూత్ వర్ధన్నపేట నియోజకవర్గ కన్వీనర్ కుక్కల దేవరాజ్కు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారన్నారు. పార్టీని నమ్మి వచ్చిన కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం..
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మడికొండలో రూ.2.5కోట్లతో, టేకులగూడెంలో రూ.కోటితో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విలీన గ్రామాలకు పట్టణ వాతావరణం కల్పించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆవాల రాధికారెడ్డి, మెట్టుగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ బొల్లికొండ రవీందర్, నాయకులు ఇండ్ల నాగేశ్వర్రావు, పోలపల్లి రామ్మూర్తి, తాడూరి మోహన్, దువ్వ నవీన్, ఆకారపు నాగరాజు, పల్లపు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..
హసన్పర్తి : ప్రతి డివిజన్ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65 డివిజన్ పరిధిలోని సుబ్బయ్యపల్లిలో రూ.50 లక్షలతో గ్రంథాలయం, సీసీ రోడ్డు పనులు, దేవన్నపేట, కోమటిపల్లిలో రూ. 2 కోట్లతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుబ్బయ్యపల్లిలోగ్రంథాలయాన్ని ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ రాజునాయక్, ఎంపీపీ సునీత, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్రెడ్డి, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్రెడ్డి, అంబేద్కర్ అవార్డు గ్రహీత జయాకర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పుట్ట శంకర్, కొక్కిరాల రవీందర్రావు, డివిజన్ అధ్యక్షుడు భూపాల్గౌడ్, ప్రధాన కార్యదర్శి మణీంద్రనాథ్, సాంబయ్యనాయక్, రమేశ్నాయక్, సుభాశ్గౌడ్, రవి, బయ్యగోని శ్రీనివాస్, మల్లారెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.