పల్లెల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
అనంతారంలో సీసీ రోడ్లు, శ్మశాన వాటిక,పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ ప్రారంభం
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
చింతనెక్కొండలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
పర్వతగిరి, జనవరి 8 : నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మండలంలోని అనంతారం గ్రామంలో సుమారు రూ.60 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించి, రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రూ. 50 వేల కోట్లు విడుదల చేసి వారికి అండగా నిలిచారన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని, నియోజకవర్గ రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయొద్దని, త్వ రితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చిట్టిమల్ల విజయలక్ష్మి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ..
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే అరూరి అన్నారు. చింతనెక్కొండ చౌరస్తాలో హితకారిణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, పోరాట యోధుడు గటిక నర్సయ్య విగ్రహాలను ఆవిష్కరించారు. బాబు జగ్జీవన్రావు విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అలాగే ఇటీవల మృతిచెందిన తాళ్ల ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.25వేల ఆర్థికసాయం అందించారు. కొంకపాకలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ బానో త్ సింగ్లాల్, ఎంపీపీ లునావత్ కమల పంతులు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, ఎంపీడీవో సంతోష్కుమార్, ఎంపీవో మధుసూదన్, పీఆర్ ఏఈ కవిత, మండలాధ్యక్షుడు రంగు కుమార్, మార్కెట్ డైరెక్టర్లు శాంతి రతన్రావు, ఏకాంతం గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మ ద్ సర్వర్, సర్పంచులు దేవేందర్, రమేశ్, అమడగాని రాజు, వెంకన్న నాయక్, సుష్మ, ఉపసర్పంచ్ ధర్నోజు దేవేందర్, ఎంపీటీసీలు మోహన్రావు, భాస్కర్, సుభాషిణి, మౌనిక, నాయకులు దుర్గారావు, కిషన్నాయక్, వెంకట్రావు, హితకారిణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గటిక మల్లయ్య, గటిక స్వామి, శ్రీనివాస్, సీఏ రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.