15-18 సంవత్సరాల బాలబాలికలు టీకా వేసుకోవాలి
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
పోచమ్మమైదాన్, జనవరి 8 : ప్రస్తుతం కరోనా పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. వరంగల్ పోచమ్మమైదాన్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో 15-18 సంవత్సరాల వయస్సు బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కరోనా అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా నివారణపై పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రజల సహకారం తోడైతే కరోనా మహమ్మారిని పారద్రోలవచ్చన్నారు. ప్రతి ఒకరు వ్యాక్సిన్తో పాటు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 15 నుండి 18 సంవత్సరాల బాలబాలికలందరూ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, వైద్య సిబ్బంది, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.