దుగ్గొండి, ఫిబ్రవరి 1: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని పొనకల్, బిక్కాజిపల్లెలో ప్రజాప్రతనిధులు, అధికారులతో కలిసి మంగళవారం ఆయన శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డును పరిశీలించారు. త్వరతిగతిన పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. హరిసింగ్ వెంట నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, తాసిల్దార్ సంపత్కుమార్, సర్పంచ్లు బోమ్మగాని ఉర్మిళా వెంకన్న, సింగనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ బండి జగన్నాథం, ఆర్ఐ ఆనంద్కుమార్, కార్యదర్శి కవిత పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు
ఖానాపురం/నర్సంపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతక్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించొద్దని ఏపీడీ సాయిచరణ్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని రాగంపేట, కొత్తూరు, రంగాపురం, ఖానాపురంలో పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా కొన్ని జీపీల్లో ఇప్పటికీ శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు పూర్తి కాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి పెండింగ్ పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ భాషబోయిన ఐలయ్య, బూస రమ, కందిక నరేశ్, చిరంజీవి, కార్యదర్శులు ఉన్నారు. నర్సంపేట మండలం రాజుపేటలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధ్వంసమైన డంపింగ్ యార్డులోని పైకప్పు రేకులను డీపీవో ఎన్ స్వరూప పరిశీలించారు. అనంతరం నర్సరీ, పారిశుధ్యం, శ్మశాన వాటిక నిర్మాణ పనులు, వాటి పురోగతిని తెలుసుకున్నారు. తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అన్ని రికార్డులను తనిఖీ చేశారు. కార్యదర్శులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆమె వెంట సర్పంచ్ దస్రూ, కార్యదర్శి సాయిరాం, వార్డు సభ్యులు ఉన్నారు.