నర్సంపేట నియోజకవర్గంలో 100 యూనిట్ల కేటాయింపు
దళిత కుటుంబాల్లో వెలుగులు
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకన్నగౌడ్
పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం
చెన్నారావుపేట, ఫిబ్రవరి 1: దళితబంధు పథకంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి 100 యూనిట్ల కేటాయింపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గానికి 100 యూనిట్లు కేటాయించగా, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి లింగగిరి గ్రామానికి 12 యూనిట్లు కేటాయించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, ఖాదర్పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు సాదు నర్సింగరావు ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్నగౌడ్ పాల్గొని మాట్లాడారు. లబ్ధిదారులు పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. అనంతరం వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని దళితులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పర్కాల లక్ష్మీరాజన్న, ఉపసర్పంచ్ బూరుగు రాజశేఖర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదారపు శ్రీను, వార్డు సభ్యులు మంద యాకాంబ్రం, కడగండ్ల సమ్మక్క, పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు మేడబోయిన కుమార్, నాయకులు రాకం సాంబయ్య, పాలకుర్తి వెంకన్న, కడగండ్ల యాకయ్య, కుమారస్వామి, బర్ల ప్రవీణ్, రాకం వేణు, మాదారపు సునీత, జక్కుల సాంబయ్య పాల్గొన్నారు.
బుధరావుపేటలో క్షీరాభిషేకం..
ఖానాపురం: బుధరావుపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దళితులతో కలిసి నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య మాట్లాడుతూ దళితబంధు పథకంలో మొదటి విడుతలో బుధరావుపేట ఎంపికై 12 యూనిట్లు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, ఎంపీటీసీ షేక్ సుభాన్బీ, మౌలానా, ఉప సర్పంచ్ రమ, మురళి, పార్టీ గ్రామఅధ్యక్షుడు యాకూబ్పాషా, నేలమారి నాగరాజు, రాజశేఖర్, వార్డు సభ్యులు రవి, సాంబరాజు, జమాల్, లతీఫ్, పసునూరి వెంకన్న, సుధాకర్, నర్సయ్య, శ్రీను పాల్గొన్నారు.
తోపనపల్లిలో వెల్లివిరిసిన ఆనందం
నెక్కొండ: దళితబంధు పథకంలో తోపనపల్లి ఎంపిక కావడంతో గ్రామంలోని దళితుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య మాట్లాడుతూ దళితబంధు పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. మొదటి విడుతలో గ్రామంలో 12 మందికి ప్రభుత్వ సాయం అందుతుందన్నారు. దశలవారీగా అర్హులందరికీ దళితబంధు పథకం ఫలాలను సర్కారు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, బళ్ల వెంకన్న, ఉప సర్పంచ్ సమ్మయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వెంకన్న, సర్పంచ్ ఫకీర్మియా, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, నాయకులు మాదాసు రవి, బక్కి కుమారస్వామి పాల్గొన్నారు.