కాశీబుగ్గ, ఫిబ్రవరి 1 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్కు వరంగల్ 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ వాసులు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ లో శ్మశానవాటికతోపాటు సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఈర్ల రాజేందర్, నీరటి సురేశ్, పిట్ట నగేశ్, పోడిశెట్టి అశోక్చారి, ఈర్ల రాజు, కొమ్ము కుమార్, ఎస్.కే.పాషా, బొల్లం రవి, ఓర్సు అంజయ్య, డాక్టర్ రాజేందర్, యూత్ అధ్యక్షుడు కస్తూరి భరత్, మహిళా అధ్యక్షురాలు ఆకుల వనజ, ఎండీ నజీమా, బొల్లే ప్రభావతి, పోడిశెట్టి అన్నపూర్ణ, గడ్డం రాజమణి, కొమ్ము ప్రణయ్, పిట్ట సుధీర్, సింగారపు మధుకర్ పాల్గొన్నారు.
అరూరిని కలిసిన వర్ధన్నపేట నాయకులు
వర్ధన్నపేట : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ను మండలానికి చెందిన నాయకులు మంగళవారం హనుమకొండలోని ఆయన స్వగృహంలో కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ల్యాబర్తి సర్పంచ్ పస్తం రాజు, ఉపసర్పంచ్ పిన్నింటి కళింగరావు, బొక్కలగూడెం సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నారు.