ఉపాధి హామీకి రూ.25వేల కోట్ల కోత
గ్రామీణాభివృద్ధి శాఖకూ తగ్గింపు
మిషన్ భగీరథకు మొండిచేయి
వ్యవసాయానికి సహాయ నిరాకరణ
విభజన హామీలకు తిలోదకాలు
రాష్ర్టానికి ప్రశంసలే తప్ప నిధుల్లేవు
బడ్జెట్పై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు
హనుమకొండ, ఫిబ్రవరి 1: ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు.. ప్రజలు నమ్ముతూ వచ్చారు. అచ్చేదిన్ రానీ రాకపోనీ కానీ తాజా బడ్జెట్ను చూస్తే జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తున్నది’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ నిష్ప్రయోజక, నిరర్ధకమైందని అభివర్ణించారు. బడ్జెట్లో అన్నీకోతలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్రపన్నుతోందన్నారు. ఉపాధి హామీకి ఇంతకుముందు రూ. 98వేల కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ. 73వేల కోట్లకు కుదించడం, గ్రామీణాభివృద్ధి శాఖకు సైతం కేటాయింపులు తగ్గించడం సమంజసం కాదన్నారు. వ్యవసాయానికి కేంద్రం పూర్తిగా సహాయ నిరాకరణ చేసిందని, యూరియా, ఇతర ఎరువులపై మొత్తం రూ.34900 కోట్ల సబ్సిడీ తగ్గించిందని, దీంతో ఇక రైతులకు వ్యవసాయం భారంగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిధులు అడిగామని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కోరామని, ఐఐఎం, కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు వంటి జాతీ య విద్యా సంస్థలను, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులు ఇస్తామని చెప్పారని, ఈ అంశాలను బడ్జెట్లో పట్టించుకున్న దాఖలాలే లేవని చెప్పారు.
ప్రజలు ఎక్కువగా నమ్మే ఎల్ఐసీని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడం దారుణం, విచారకరమైన విషయం మరోటిలేదన్నారు. రాష్ర్టాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక నిధి ద్వారా రాష్ర్టాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామంటున్నదని, ఉన్న నిధులకే దికులేక కోతలు విధిస్తూ, కొత్తగా కేం ద్రం అప్పులు ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదని మంత్రి ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, మేడారం జాతర ప్రస్తావనే లేదని, వరంగల్ టెక్స్ టైల్ పార్కు నిధుల ఊసేలేదని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలకు అవార్డులు, రివార్డులు ఇస్తున్న కేంద్రం రాష్ర్టానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ బిడ్డలుగా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారని, రాష్ర్టానికి వీళ్లు తెచ్చిందేమిటి? కేంద్రం ఇచ్చిందేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి సవాల్ చేశారు.