నెక్కొండ, జనవరి 1 : అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా అందరూ ముం దుకు సాగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలో అం బేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ నాయకుడు తాటిపెల్లి శివకుమార్ ఏర్పాటు చే యించిన స్టీల్ రెయిలింగ్ గ్రిల్స్ , గేట్, నిచ్చెనను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం శివకుమార్ను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్నబీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, పట్టణాధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఈదునూరి యాకూబ్, ఈదునూరి వెంకన్న, బిర్రు సుదర్శన్, ఈదునూరి యాకయ్య, ఈదునూరి రమేశ్, సూర్యారావు, తాటికాయల యాకయ్య, టీఆర్ఎస్ నాయకులు చెన్నకేశవరెడ్డి, రాజిరెడ్డి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.