పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్రెడ్డి
గణపురం, మే 1 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్రెడ్డి అన్నారు. మండలంలోని బస్వరాజుపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్, ఉప సర్పంచ్ శ్రీలత, ఎంపీటీసీ జంగిలి భవిత, టీఆర్ఎస్ గ్రామఅధ్యక్షుడు మార్త శ్రీనివాస్, మార్త సుధాకర్, సీఈవో గోవర్ధన్ సొసైటీ డైరక్టర్లు నామాల రమేశ్, దుగ్యాల సుధాకర్రావు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్రావు, ఏనుగుల సంపత్ పాల్గొన్నారు.
వెంకటాపూర్లో..
వెంకటాపూర్ : మండలంలోని వెల్తుర్లపల్లి గ్రామంలో పాలంపేట పీఏసీఎస్ ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బుర్ర రజితాసమ్మయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యంలో మిల్లర్లు కటింగులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పం చ్ బొజ్జ జగన్మోహన్రావు, సొసైటీ డైరక్టర్లు గోనె లత, పిల్లవేరు అహల్య, పొలం లక్ష్మయ్య, సీఈవోలు సంపత్, రాకేశ్, టీఆర్ఎస్ నాయకులు తిరుపతిరావు, సారంగపాణి, రాజు, గట్టయ్య, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.