వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
66వ డివిజన్లో టీఆర్ఎస్కు కుల సంఘాల మద్దతు
హసన్పర్తి, ఏప్రిల్ 27 : పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 66వ డివిజన్ హసన్పర్తిలో రెడ్డి, రజక, యాదవ సంఘాల సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి పాపిశెట్టి శ్రీధర్కు ఓటువేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వరంగల్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. ఇంకా గొప్పగా అభివృద్ధి చేసుకోవడానికి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్టల కుమారస్వామి, సదానందం, నర్సింహరాములు, యాదవ కుల సంఘం అధ్యక్షుడు కాల్వ కట్టమల్లు, దాడి రాజు, వేల్పుల రవి, మారం సుధాకర్, మారం నరేందర్, కాల్వ శ్రీనివాస్, రెడ్డి సంఘం అధ్యక్షుడు కడారి జగ్గారెడ్డి, వీసం సురేందర్రెడ్డి, వీసం రవీందర్రెడ్డి, మల్లారెడ్డి, జీవన్రెడ్డి, రజక సంఘం అధ్యక్షుడు గుడికందుల ఉదయ్కుమార్, ఎలుక రాజు, సదానందం, కుమారస్వామి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్రెడ్డి, సుభాష్గౌడ్, బొల్లవేణి రాజు పాల్గొన్నారు.