ఖిలావరంగల్, సెప్టెంబర్ 25: ప్రజల సహకారం తీసుకుని అధికారులు గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘ఆజాది కా అమృత్ మహోత్సవం, స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల సర్పంచ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్లు, జీపీ సిబ్బంది శ్రద్ధగా విధులు నిర్వర్తించినప్పుడే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో సమన్వయంతో పని చేయాలన్నారు. సర్పంచ్లు వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసి ప్రకటించుకోవచ్చన్నారు. పంచాయతీరాజ్ చట్టం, దాని విధివిధానాలు, ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాల వినియోగంపై సర్పంచ్లకు డీఆర్డీవో సంపత్రావు, డీపీవో ప్రభాకర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, స్వచ్ఛభారత్ జిల్లా కోఆర్డినేటర్ మలినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పంటల మార్పిడి జరగాలి
ఖిలావరంగల్: డిమాండ్కు తగ్గట్టు పంటల మార్పిడి జరగాలని కలెక్టర్ గోపి అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కలెక్టరేట్లో వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక వేత్తలతో సదస్సు జరిగింది. దేశవిదేశాలను ఆకర్షించేలా జిల్లాలో పంట ఉత్పత్తులు ఉండాలన్నారు. మిర్చి, పసుపు, పత్తి ఎగుమతులు మరింత పెంచే దిశగా సంబంధిత శాఖలు, పారిశ్రామిక వేత్తలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. బ్యాంకు రుణాలపై ఎల్డీఎం సత్యజిత్ కలెక్టర్కు వివరించారు. సదస్సులో పరిశ్రమల శాఖ జీఎం నర్సింహమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బీ రవీందర్రెడ్డి, మిర్చి ఎగుమతిదారుడు వంశీ, స్పెస్ బోర్డు డైరెక్టర్ లింగప్ప పాల్గొన్నారు.