వరంగల్, డిసెంబర్ 6 : వైద్య విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలువాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్ఆర్ఐ భవన్లో జరిగిన వైద్య విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. మొదట ర్యాగింగ్కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సా మాజిక బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు.
ర్యాగింగ్ శృతిమించితే చ ర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులకు ర్యాగింగ్ చట్టంపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థులు స్నేహ భావంతో మెలగాలన్నారు. కళాశాలలో సీసీ కెమెరాలు, లైటింగ్ పెంచాలని ప్రిన్సిపాల్కు సూచించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.
సైకాలజిస్టులతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచుకోవాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించా రు. లాక్డౌన్ సమయంలో రోడ్లపై రద్దీ లేకున్నా 400 మంది యువ త రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం బాధాకరమన్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ మా స్కులు ధరించాలని సూచించారు.
వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరోనా కా లంలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవల పై విద్యార్థులు చేసిన ప్రదర్శన హైలెట్గా నిలిచించి. కార్యక్రమంలో డీసీపీ పుష్ప, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, రాంకుమార్రెడ్డి, విజయ్కుమార్ పాల్గొన్నారు.