ఖిలావరంగల్, ఆగస్టు 28: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని కాకతీయుల శిల్ప సంపదకు మహర్దశ పట్టనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కీర్తి తోరణాలతోపాటు వాటి మధ్య ఉన్న శిల్పాలు ఇక మెరువనున్నాయి. వీటికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేంద్ర పురావస్తుశాఖ నడుం బిగించింది. రెండేళ్ల క్రితం ఖుష్మహల్కు కెమికల్ ట్రీట్మెంట్ చేసి పర్యాటకుల ఎదుట సరికొత్తగా ఆవిష్కరింపజేశారు. ప్రస్తుతం అదే తరహాలో కీర్తి తోరణాల మధ్యనున్న ప్రతి శిల్పానికి కెమికల్ ట్రీట్మెంట్తో శుభ్రం చేసి పర్యాటకులకు సరికొత్తగా చూపించేందుకు ఆ శాఖ పనులను వేగవంతం చేసింది. ఇదిలా ఉండగా కోటలోని ప్రతి చారిత్రక కట్టడాన్ని రసాయనలతో శుద్ధి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.