నల్లబెల్లి, జూలై 27: ప్రజల్లో అవగాహన పెరుగడంతో ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ మేరకు మండలకేంద్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకుని వ్యాక్సిన్ కోసం బారులుతీరుతున్నారు. నల్లబెల్లి పీహెచ్సీలో మంగళవారం టీకాలు వేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బానోత్ సంగూలాల్ వ్యాక్సిన్ వేసుకుని మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని తెలిపారు. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయడంతోనే నేడు కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి మహేందర్నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు: కరోనా నివారణ వ్యాక్సిన్ కోసం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. టీకా అందక కొందరు వెనుదిరిగారు. అధికారులు స్పందించి వచ్చినవారందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
శాయంపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీ వద్ద కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు బారులుతీరారు. వైద్యాధికారి నాగశశికాంత్, హెచ్ఈవో వెంకటేశ్వరవర్మ, హెల్త్ అసిస్టెంట్ చలపతి ఆధార్కార్డు ఆధారంగా వివరాలు నమోదు చేసుకుని కొందరికి మొదటి డోస్, మరికొందరికి సెకండ్ డోస్ టీకా వేశారు. మంగళవారం 198 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి తెలిపారు. పీహెచ్సీలో ప్రతి సోమ, మంగళవారం మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు.
నడికూడ: మండలంలోని రాయపర్తి పీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు వైద్యాధికారి ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా 180 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. కాగా, 124 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు చెప్పారు.
గీసుగొండ: స్థానిక పీహెచ్సీలో 220 మందికి కరోనా పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మాధవీలత తెలిపారు. ప్రతి గురు, శుక్రవారం కరోనా టీకాలు వేయనున్నట్లు ఆమె చెప్పారు. లక్షణాలు ఉన్న వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.