రాయపర్తి, జూలై 27: మిషన్ భగీరథ జలాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష అన్నారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ గారె నర్సయ్య అధ్యక్షతన మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మండలకేంద్ర వాసులు తప్పనిసరిగా భగీరథ జలాలను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రైవేట్ మినరల్ వాటర్ కంటే భగీరథ జలాలు తాగడం వల్ల ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతోపాటు ఆర్థిక వ్యయాలను తగ్గించుకోవచ్చన్నారు. అనంతరం సర్పంచ్ నర్సయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, ఎంపీటీసీ అయిత రాంచందర్, కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్, కారోబార్ కారుపోతుల రాంచంద్రయ్యతో కలిసి గ్రామంలోని వార్డులు, వీధులు, కాలనీల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం నూతన పైపులైన్ల ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. గ్రామసభలో స్థానికులు మల్యాల నర్సింహమూర్తి, ఎనగందుల శ్యాంసుందర్, మచ్చ సత్యం, చిన్నాల యాకయ్య, వార్డు సభ్యులు లావణ్య, విజయలక్ష్మి, పలు విభాగాల సిబ్బంది జయలత, ఎనగందుల సరస్వతి, రాజేశ్వరి, రజియా, వీద చంద్రకళ, గారె కవిత, అయిత కృష్ణవేణి, ఆకారపు శశిరేఖ, అయిత విజయారాణి, మచ్చ సంపత్, తాటికాయల పద్మ, ఐలమ్మ, నర్సమ్మ, సమ్మయ్య, మల్లయ్య, రాజు, పల్లె అభిషేక్, పిల్లి విజయ్కుమార్, కొండేటి రాజు, డీ భీమేశ్ పాల్గొన్నారు.