కురవి, జూలై 20 : అవయవదానం అత్యున్నతమైనదని, అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. కురవి మండల కేంద్రంలో తహసీల్దార్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్కుమార్ అవయవదాన అంగీకార పత్రాన్ని పరికిపండ్ల అశోక్కు అందజేశారు. అనంతరం డాక్టర్ అశోక్ మాట్లాడుతూ.. చనిపోయిన తర్వాత విలువైన అవయవాలను కాల్చి బూడిద చేయకుండా కుటుంబీకులు దానం చేసి చనిపోయిన వారిని చిరంజీవులను చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్నవారితో అవయవదానం చేస్తామని ప్రమాణం చేయించారు. అవయవదాన అంగీకార పత్రాలను అందజేసిన తహసీల్దార్ను అభినందించడంతోపాటు ఆయనను ఆదర్శంగా తీసుకుని అధికారులు అవయవదానంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే ధన్సింగ్, సివిల్ అస్పిరెంట్ రాజ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రహమాన్, శేఖర్, ముజాయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.