హన్మకొండ, జూలై 13 : కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సిరిసిల్ల నుంచి హెలికాప్టర్లో వరంగల్కు చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి కొవిడ్, వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణకు జ్వర సర్వేను మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ సర్వేలో ఆరోగ్య సిబ్బందితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో కార్పొరేషన్ సిబ్బందిని భాగస్వాములను చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో కొవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత వరంగలే పెద్ద నగరమని, ఇక్కడ జనసాంద్రత అధికంగా ఉండడం వల్ల కరోనా వ్యాప్తి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గ్రామ స్థాయిలో వైద్యాధికారులు పర్యటిస్తూ ప్రజారోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు గుంపులుగా తిరుగకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులు, టీచింగ్ దవాఖానల సూపరింటెండెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి పాజిటివ్ కేసుకు 25 మంది కాంటాక్టులను గుర్తించి, పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కమలాపూర్, గోపాల్పూర్, ముల్కనూర్ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పీహెచ్సీల్లో తగిన చర్యలు తీసుకోవాలి
పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న పీహెచ్సీలో వైద్యాధికారులు సత్వరమే కేసులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాసరావు సూచించారు. జిల్లాలోని తొమ్మిది పీహెచ్సీల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్నారు. కరోనా టెస్టుల లక్ష్యం 12,000కు పెంచుతున్నట్లు తెలిపారు. పీహెచ్సీలో 300 నుంచి 400 వరకు పరీక్షలు చేయాలని ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి
అన్ని వైద్య విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డి సూచించారు. దవాఖానల్లో అడ్మిట్ అయిన కేసులు ఏ ప్రాంతం నుంచి అధికంగా వస్తున్నాయో గుర్తించి, ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేయాలన్నారు. పిల్లల వైద్య విభాగంలో కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే చేపట్టాలని సూచించారు. సమావేశంలో టీఎస్ఎంఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కే చంద్రశేఖర్రెడ్డి, సీఎంవోఎస్డీ డాక్టర్ టీ గంగాధర్, అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఎంహెచ్వో డాక్టర్ కే లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వీ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, జీఎంహెచ్, సీకేఎం సూపరింటెండెంట్లు డాక్టర్ సరళాదేవి, డాక్టర్ నిర్మల, కంటి దవాఖాన సూపరింటెండెంట్ గిరిధర్రెడ్డి, అడిషనల్ డీఎంహెచ్వో మదన్మోహన్రావు, జిల్లా సర్వేలైన్స్ అధికారి కృష్ణారావు, డిప్యూటీ డీఎంహెచ్వో ఎండీ యాకూబ్ పాషా, చీఫ్ ఎంహెచ్వో బీ రాజారెడ్డి, ప్రోగ్రాం అధికారులు ఉమాశ్రీ, మల్లికార్జున్, గీతాలక్ష్మి, వాణిశ్రీ