నర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం/చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలోని పలు తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లాభవానీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నర్సంపేటలోని పాకాల రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో సేవాలాల్ నర్సంపేట డివిజన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఉదయ్సింగ్ పాల్గొని మాట్లాడారు. లంబాడ సంస్కృతికి నిదర్శనం సీత్లా పండుగ అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గిరిజనులు ఏటా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు ఆంగోత్ భద్రయ్య, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, వాసునాయక్, జేతురాంనాయక్, జగన్నాయక్, మోహన్నాయక్, హరిపతి, పూల్సింగ్నాయక్, లింగంనాయక్, రాములునాయక్, స్వామినాయక్, వీరన్ననాయక్ పాల్గొన్నారు.
అలాగే, రాములునాయక్తండా, భోజ్యానాయక్తండాలో సీత్లాభవానీ వేడుకలు జరుపుకున్నారు. మాజీ సర్పంచ్ సుధాకర్లాల్, పూల్య, యాకూబ్, చందర్, ఈరు, దేవసింగ్, నర్సింహ పాల్గొన్నారు. దుగ్గొండి మండలం రాజ్యాతండాలో సర్పంచ్ అజ్మీరా రవీందర్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామ పెద్దలు వీరభద్రు, తిరుపతి, రాజు, దంజ్యానాయక్ పాల్గొన్నారు. ఖానాపురం మండలం వేపచెట్టుతండా, కోమటిపల్లితండాలో సర్పంచ్ భూక్యా పద్మావతి, వెంకన్న, కుల పెద్దలు సీత్లాభవానీకి ప్రత్యేక పూజలు చేశారు. చెన్నారావుపేట మండలంలో సీత్లా భవానీకి కులపెద్దలు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. టీఆర్ఎస్ యువనేత కంది కృష్ణచైతన్య, జాగృతి మండల అధ్యక్షుడు రమేశ్, రాజు హాజరయ్యారు.