ఖిలావరంగల్/కాశీబుగ్గ/పోచమ్మమైదాన్/కరీమాబాద్, సెప్టెంబర్ 27: వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఖిలావరంగల్ 37వ డివిజన్లో కార్పొరేటర్ బోగి సువర్ణ రూ.87,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, టీఆర్ఎస్ నాయకులు బిల్ల రవి, నలిగంటి నవీన్, కరుణాకర్, విజయ్, అన్వేశ్, రామకృష్ణ, అభిషేక్, రామకృష్ణ పాల్గొన్నారు.
కాశీబుగ్గ 20వ డివిజన్లోని పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ పంపిణీ చేశారు. ఆయన వెంట నాయకులు ఇక్బాల్, పెండ్యాల సోని, చిమ్మని గోపి, రెడ్డి కిరణ్, కటికిరి సాయి ఉన్నారు. పోచమ్మమైదాన్లోని 22వ డివిజన్ సుజిత్నగర్కు చెందిన సీహెచ్ రమేశ్కు రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును టీఆర్ఎస్ నాయకుడు మావురపు విజయభాస్కర్రెడ్డి అందజేశారు. నాయకులు కృష్ణంరాజు, సోల రవి, చుంచు కుమార్, తోట రాము, కంచర్ల శివకుమార్, జూపాక సురేశ్, రాజబాబు, సుమంత్, గీత, పావని, స్వరూప, విజయ పాల్గొన్నారు. 23వ డివిజన్లో కొత్తవాడకు చెందిన కుసుమ రాజుకు రూ. 60 వేల చెక్కును మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి అందజేశారు.
నాయకులు సత్యనారాయణ, కుమార్, సతీశ్, సునీల్యాదవ్, రహీం, రాము, వినయ్ పాల్గొన్నారు. కరీమాబాద్లోని పలువురు లబ్ధిదారులకు 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వాకర్స్తోపాటు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉర్సు రంగలీల మైదానంలోని పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. ఆయన వెంట పూదరి అజయ్, బత్తిని రంజిత్, బైరగోని మనోహర్ తదితరులు ఉన్నారు.