వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 22: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో కేర్ ఇండియా ఎన్జీవోస్ నుంచి 10 వాహనాలను జిల్లాకు కేటాయించారని డీఎంహెచ్వో డాక్టర్ వెంటకరమణ అన్నారు. బుధవారం ఆయన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మారుమూల గ్రామానికి సైతం వ్యాక్సిన్ అందించడానికి ఈ వాహనాలు ఉపయోగపడుతాయన్నారు. జిల్లా అదనపు డీఎంహెచ్వో డాక్టర్ సుధార్సింగ్, ప్రోగ్రాం ఆఫీసర్ మధుసూదన్, డీఐవో డాక్టర్ ప్రకాశ్, డిస్ట్రిక్ వ్యాక్సినేషన్ మేనేజర్ సంపత్ పాల్గొన్నారు.
అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన అర్హులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎంపీవో కూచన ప్రకాశ్ కోరారు. మెడికల్ ఆఫీసర్ మహేందర్నాయక్తో కలిసి బుధవారం ఆయన కన్నారావుపేట, మూడుచెక్కలపల్లిలో వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కార్యదర్శులు, సర్పంచ్లు టెంట్లు వేసి కుర్చీలు, నీటి వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు తంగెళ్ల నిర్మలారవీందర్రెడ్డి, ఫూల్సింగ్, కార్యదర్శులు శ్రీనివాస్, యాదగిరి, ఏఎన్ఎంలు, ఆశ వర్కలు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో టీకాలు పూర్తిస్థాయిలో వేసుకున్న ఇండ్లకు అంగన్వాడీలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్టిక్కర్లు వేస్తున్నారు.
వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నర్సంపేట మండలంలోని భాంజీపేట పీహెచ్సీతోపాటు సబ్ సెంటర్లలో బుధవారం వ్యాక్సినేషన్ కొనసాగింది. వైద్య సిబ్బంది అర్హులందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామాల్లో కరోనా టీకా కార్యక్రమం కొనసాగుతున్నది. గీసుగొండ, ఎలుకుర్తి సబ్ సెంటర్లను వైద్యాధికారి మాధవీలత సందర్శించారు. ఆమె వెంట సీహెచ్వో మధుసూదన్రెడ్డి, సూపర్వైజర్ కిరణ్కుమార్ ఉన్నారు. కాశీబుగ్గ పరిధి 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ డివిజన్లో వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించారు.