కమలాపూర్, సెప్టెంబరు 22: గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ, చేనేత కార్మికులకు నేతన్నకు చేయూత వంటి పథ కాలు పెట్టి బీసీలను ఆదుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవా రం కమలాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మొర్రి ఓదెలుతోపాటు 50 మంది బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్వా నించారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఏనాడైనా బీసీల కోసం ఆలోచన చేసిందా? కేంద్రం లో వారి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాల ని, చట్టసభల్లో వారికి రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేద న్నారు. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఏనాడైనా గౌడలు, చేనేత కార్మికులు, గొల్లకురుమలను ఆదుకోవాలనే ఆలోచన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేశాయా.. అని నిలదీశా రు. కుల వృత్తులను ధ్వంసం చేసిన చరిత్ర ఆ పార్టీలదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఆదుకుంటున్నారని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్లు ఏనాడైనా గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ చేసిందా, చెట్టు పన్ను రద్దు చేయాలనే ఆలోచన చేసిందా? ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గొర్రెపిల్లలు పంపిణీ చేసిందా.. అని ప్రశ్నించారు. నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు, ఆరోగ్యబీమా, ఇన్సూరెన్స్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రద్దు చేసింది బీజేపీ కాదా అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రైల్వేలో ఉద్యోగుల సంఖ్య మూడు లక్షలకు తగ్గిపో యిందని, బీఎస్ఎన్ఎల్లో 50 వేల ఉద్యోగాలు తొలగిం చిందన్నారు.
బీజేపీ ఏం చేసిందని ఓటు అడుగుతున్నదని, ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కమలాపూర్, హుజూ రాబాద్కు వస్తున్న కేంద్ర మంత్రులు మమ్మల్ని చూసి ఓటు వేయాలని అంటున్నారే తప్ప, ఏం చేస్తరో చెప్పడం లేదన్నా రు. జనగణన చేయాలని దేశంలోని బీసీలు అడుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందించడం లేదన్నారు. బీసీ వర్గాలకు ఏం న్యాయం చేయని ఆ పార్టీ, వారిని ఓట్ల కోసమే వాడు కునేందుకు చూస్తున్నదని విమర్శించారు. బీసీ కులాల్లో రోజు రోజుకూ టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుండడంతో బీజేపీ నాయకులు గొడవలు పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నట్లు చెప్పారు. వారు ఏం చేశారో, ఏం చేస్తరో చెప్పా లని అడిగితే స్పందించడం లేదన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రజలు ఉన్నా రన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాం, ఏం చేస్తదో చెప్పామన్నారు. ఇప్పటికే గెల్లు శ్రీను గెలుపు ఖాయమైంద ని, మెజారిటీయే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను కో రారు. బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నదని, టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గ్రామాల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఓయూ జేఏసీ నేత రాజా రాంయాదవ్, మండల ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, సింగిల్విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసే నారెడ్డి, డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంపత్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.