హనుమకొండ, సెప్టెంబర్ 22: దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మనసు న్న మారాజు అని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటే శ్మాదిగ అన్నారు. బుధవారం హనుమకొండ లోని ఏకశిలా పారులో బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు జరిగి తీరుతుందని, ప్రతిపక్ష పార్టీ ల నాయకులు ఈ పథకంపై దుష్ప్రచారం చెయ్య డం సిగ్గుచేటన్నారు. కొంత మంది నాయకులు పాదయాత్రల పేరుతో దళితబంధును అడ్డుకోవా లని చూస్తున్నారని, వాళ్లను తెలంగాణ దళిత స మాజం ఎన్నటికీ నమ్మబోదని ఆయన పేర్కొన్నా రు. దేశంలో ఇప్పటి వరకు దళితుల కోసం ఏ పార్టీ, ఏ నాయకులు ఇలాంటి పథకాన్ని ప్రవేశపె ట్టలేదని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు దళితుల నోటి కాడి బుకను ఎత్తగొట్టే ప్రయత్నం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం రైతు బంధు, గొర్రెలు, బర్రెలు, వలలు, చేపల పథకా లు అమలుచేస్తుంటే మాకెందుకు ఇవ్వడంలేదని అడిగామా?ఇప్పుడు మాకు దళితబంధు ఇస్తుం టే ఓర్వలేక అడ్డుపడడం మానుకోవాలన్నారు. ఈ నెలాఖరులో హుజూరాబాద్ నుంచి హైదరాబా ద్ వరకు పాదయాత్ర చేసి దళితులను చైతన్యం చేసి సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తామని అన్నా రు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు చేరాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి కండే రమేశ్, పొలిట్బ్యూరో సభ్యులు రవి, బెజ్జంకి బాబు, జాతీయ కార్యదర్శులు మెరుగు వెంకన్న, మైసూ ర్ సమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శులు మ ట్టెల రాజు, బోయిని రవి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కండే చక్రపాణి, జిల్లా నాయకులు మర్రి శ్రీను, కడారి బాబు, చల్లూరి రాజు పాల్గొన్నారు.