పరకాల, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని, వారే పార్టీకి పట్టుగొమ్మలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ములుగురోడ్డు సమీపంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, నియోజకవర్గ పరిశీలకుడు జడ్పీ చైర్మన్ ఎం సుధీర్బాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆలోచన నుంచే టీఆర్ఎస్ పుట్టిందని, పార్టీ కోసం కష్టపడేవారు కార్యకర్తలు కాదని, వారందరూ నాయకులేనని అన్నారు. సంక్షేమ పథకాలు అందని గడప లేదన్నారు.
మండల కమిటీల ఎన్నిక
నియోజకవర్గంలోని పలు మండలాల టీఆర్ఎస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ, గీసుకొండ, సంగెం మండలాలతోపాటు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలోని 15, 16, 17వ డివిజన్ల కమిటీలను ప్రకటించారు. పరకాల మండల అధ్యక్షుడిగా చింతిరెడ్డి మధుసూదన్రెడ్డి(నాగారం), ప్రధాన కార్యదర్శిగా బరిగెల చంద్రమౌళి (వెల్లంపల్లి), ఆత్మకూరు మండల కమిటీ అధ్యక్షుడిగా లేతాకుల సంజీవరెడ్డి (ఆత్మకూరు), ప్రధాన కార్యదర్శిగా బొల్లోజు కుమారస్వామి(పెద్దాపురం) ఎన్నికయ్యారు.
దామెర మండల అధ్యక్షుడిగా గుండు రామకృష్ణ (దుర్గంపేట), ప్రధాన కార్యదర్శిగా ముదిగొండ కృష్ణమూర్తి (పులుకుర్తి), నడికూడ మండల అధ్యక్షుడిగా ధూరిశెట్టి చంద్రమౌళి(నడికూడ), ప్రధాన కార్యదర్శిగా నందికొండ గణపతి రెడ్డి(చర్లపల్లి), గీసుగొండ మండల అధ్యక్షుడిగా వీరగోని రాజ్కుమార్(గీసుగొండ), ప్రధాన కార్యదర్శిగా చల్లా వేణుగోపాల్రెడ్డి (ఎలుకుర్తి), సంగెం మండల అధ్యక్షుడిగా పసునూరి సారంగపాణి (కాపులకనిపర్తి), ప్రధాన కార్యదర్శిగా జక్క మల్లయ్య(రామచంద్రపురం), 15వ డివిజన్ అధ్యక్షుడిగా కందుల శ్రీనివాస్రెడ్డి(గొర్రెకుంట), ప్రధాన కార్యదర్శిగా గజ్జి రాజు(మొగిలిచర్ల), 16వ డివిజన్ అధ్యక్షుడిగా పోగుల సంజీవ (గరీబ్నగర్), ప్రధాన కార్యదర్శిగా కక్కెర్ల రవితేజ(కీర్తినగర్), 17వ డివిజన్ అధ్యక్షుడిగా కత్తెరపల్లి దామోదర్(గాడిపల్లి), ప్రధాన కార్యదర్శిగా మారపాక రాజీవ్ గాంధీ (దూపకుంట) నియమించినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏ బాబురావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, చింతం సదానందం, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.